Skip to main content

Posts

Showing posts from 2012
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘ షాడో’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకీ డాన్ పాత్రపోషిస్తున్నారు.   కంత్రి, బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది.  నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. http://youtu.be/F4GznCvAGoc

రెబల్ రివ్యూ

http://www.apgap.com/rebel-2012-telugu-movie-review/  రెబల్ రివ్యూ కోసం పై లింక్ ని నొక్కండి 

'ఎవడు' చిత్రం కోసం '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగు

దేవిశ్రీ ప్రసాద్ 'ఎవడు' చిత్రం కోసం ఓ ఐటంసాంగ్ ను కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దేవిశ్రీ '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగును సిద్ధం చేశాడు.  'గబ్బర్ సింగ్' చిత్రంలో 'కెవ్వు కేక' అనే పాటలో ఆ మాట ప్రతి పాదం చివరన మాంచి ఊపుతో వస్తుంది. అలాగే ఈ పాటలో ప్రతి పాదం చివరన 'అయ్యోపాపం' అని వస్తుందట. ఈ ఐటంసాంగును ఏ మెరుపు తీగ పై చిత్రీకరిస్తారో తెలియదుగానీ, పాట మాత్రం చరణ్ కి ఎంతగానో నచ్చిందని అంటున్నారు. అద్భుతంగా వచ్చిన ఈ ఐటంసాంగుని అనూహ్యమైన స్థాయిలో తెర కెక్కించ డానికి వంశీ పైడిపల్లి సన్నాహాలు చేస్తున్నాడట. భారీ బడ్జెట్టుతో నిర్మితమౌతోన్న ఈ సినిమాలో సమంతా - అమీ జాక్సన్ కథానాయికలుగా అలరించనున్నారు.

‘అవును’ చిత్రం ఓ క్రైం సన్పెన్స్ థ్రిల్లర్.

క్లుప్తంగా ‘అవును’ చిత్రం ఓ క్రైం సన్పెన్స్ థ్రిల్లర్. మోహిని(పూర్ణ) ఆమె భర్త హర్ష(హర్షవర్ధన్ రాణే) ల చుట్టూ కథ తిరుగుతుంది. కొత్తగా పెళ్ళయిన వీరి జంట గండిపేట్ దగ్గరలో క్లాసిక్ హోమ్స్ అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్లిన అనతికాలంలోనే ఆ ఇంట్లో కొన్ని విచిత్రమయిన సంఘటనలు జరుగుతాయి. ఒకఆత్మ మోహినిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదిలా జరుగుతుండగా పక్కన ఇంట్లో పిల్లాడు విక్కి తన చనిపోయిన తాతతో మాట్లాడుతుంటాడు. విక్కికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి కాని ఎవరు అతనిని నమ్మరు. మోహిని వాళ్ళ ఇంట్లో కెప్టన్ రావు ఆత్మ ఉందని ఆ అబ్బాయి చెప్తాడు. హర్ష మరియు మోహిని హనీమూన్ కోసం ప్యారిస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కాని దయ్యం మోహినిని మరింత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోతుంది ఆ దయ్యం నుండి పారిపోవాలని ప్రయతించిన మోహిని ప్రయత్నాలు విఫలం అవుతాయి. మెల్లగా విక్కి తల్లి తండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు కెప్టన్ రావు ఆత్మ నిజంగానే ఉందని తెలుసుకొని మోహినిని కాపాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ ప్రయత్నం సఫలం అయ్యిందా? ఈ కెప్టన్ రావు ఎవరు? అనేది కీలకం. + points,-points         పూర్ణ నటన

తెలుగు చలన చిత్ర రంగ పరువు నిలిపాడు దర్శక ధీరుడు రాజమౌళి.

         తెలుగు చలన చిత్ర రంగ పరువు నిలిపాడు దర్శక ధీరుడు రాజమౌళి.  రెండేళ్ళపాటు నిర్విరామ  కృషి సలిపి తెరకెక్కించి  ‘ఈగ’ కష్టం ఇంకా ఫలితాలనిస్తూనే ఉంది. కలెక్షన్ల పరంగానూ తన ఆధిక్యాన్ని కనబరిచిన ఈ మూవీ ఇప్పుడు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినీలో చోటు దక్కించుకుంది. ఇండియా నుండి ఉత్తమ చిత్ర ఎంపిక కోసం వివిధ భాషల నుండి 12 సినిమాలను ఎంపిక చేయగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి 26 వరకు హైదరాబాదులో ఈ పన్నెండు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అందులో ఎంపికైన ఉత్తమ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కి పంపిస్తారు. తమిళ్ నుండి రెండు, మలయాళం నుండి రెండు, హిందీ నుండి ఏడు సినిమాలు ఎంపిక కాగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక కావటం విశేషమే కాదు, టాలీవుడ్ కు ఉపశమనం కూడా.. వివిధ భాషలకు చెందిన మిగతా చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి. •    ఈగ (తెలుగు) •    కహాని (హిందీ) •    బర్ఫీ (హిందీ) •    హీరోయిన్ (హిందీ) •    ఫెర్రారీ కి సవారి (హిందీ) •    గాంగ్స్ అఫ్ వసేపూర్ (హిందీ) •    డర్టీ పిక్షర్ (హిందీ) •    పాన్ సింగ్ తోమార్ (హిందీ) •    వజకు ఎన్ 18

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందా అని వేచి చూసే మెగాఫ్యాన్స్ కల సాగారం కాబోతోంది.

    మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందా అని వేచి చూసే మెగాఫ్యాన్స్ కల సాగారం కాబోతోంది. దీనికి సంబంధించిన స్టోరీ చరణ్ కి  మూడు నెలల క్రితమే త్రివిక్రమ్  వినిపించాడని తెలుస్తోంది. ఆ కథ నచ్చడమే కాకుండా ... త్రివిక్రమ్ టేకింగ్ స్టైల్ పై ఉన్న నమ్మకంతో చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్కిప్ట్ వర్క్ జరుగుతోందని చెబుతున్నారు. గతంలో చరణ్ - త్రివిక్రమ్ కలిసి పెప్సీ యాడ్ కోసం పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది. దాంతో త్రివిక్రమ్ తరహా వినోదాన్ని చరణ్ అద్భుతంగా పండిస్తాడంటూ అభిమానులు ఆనందంగా చెప్పుకుంటున్నారు.        'జల్సా' చిత్రంతో పవన్ కి ... 'జులాయి' చిత్రంతో అల్లు అర్జున్ కి ఘన విజయాలను సాధించి పెట్టిన త్రివిక్రమ్, ఈ సినిమాతో చరణ్ కి సంచలన విజయాన్ని అందించడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ హీరోగా ఓ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. అలాగే 'నాయక్' ... 'ఎవడు'  సినిమాలతో చరణ్ తీరికలేకుం

మీరు చూడని కొన్ని ఆణిముత్యాలాంటి కొన్ని పాత చిత్రాలు మీకోసం

దండి  ఉప్పు సత్యాగ్రహం నెహ్రు ఒరిజినల్ చిత్రం  మహాత్మునితో నేతాజీ  ఇందిరమ్మ కుటుంబం  మహాత్ముని తుదిచూపు  మహాత్మునితో ఇందిరమ్మ  బాల్యంలో మహాత్ముడు  నృత్యం చేస్తున్న మహాత్ముడు  యువ గాంధీ  హిట్లర్ తో  నేతాజీ  మహాత్ముణ్ణి చంపిన గాడ్సే    source: MY INDIA PICTURES.COM    

నాగార్జున సాయిబాబాగా తన అసాదారణ నటనతో ఎంతో అద్బుతంగా నటించిన చిత్రం :షిర్డీ సాయి చిత్ర సమీక్ష

Film : Shirdi Sai Producer : Maheshwara Reddy Director : K.Raghavendra Rao Star Cast : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee... Music Director : MM.Keeravani Rating : 3.5 నాగార్జున  సాయి బాబాగా  నటించిన షిరిడి సాయి ఈ రోజు విడుదల అయింది .నాగార్జున అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు ,నాగార్జున కలయికలో వచ్చిన మూడవ భక్తి రస చిత్రం . నాగార్జున సాయిబాబాగా తన అసాదారణ నటనతో  ఎంతో అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు మరొకసారి దర్శకత్వ తన  ప్రతిభను ఈ చిత్రంతో నిరుపించుకున్నారు .సాయిబాబా పరమ బక్తుడు నానవాలి పాత్రను సాయికుమార్  తనదైన శైలిలో సూపర్ గా నటించాడు .ఈ  చిత్రంలోని పాటలు అద్బుతంగా చిత్రీకరించాడు, ముక్యంగా ఒక్కడే సూర్యుడు .........అనే పాట   ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది అనటంలో సందేహం లేదు .సాయిబాబా ను సినిమాలోచూస్తున్నామన్న  విషయాన్నీ ప్రేక్షకుడు మరచిపోయి నిజంగా సాయిబాబా ను చూస్తున్నామన్న బ్రాంతి ని నాగార్జున తన నటనతో మంత్రముగ్దులను చేసాడు .ముఖ్యంగా నాగార్జున తన హావభావాలతో నిజంగా సాయిబాబా ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకుల మదిలో ముద్ర వేయించుకోవటం ఖాయం .కీరవాణి సంగీతం సినిమాకు ప్

తెలుగు లెక్చరర్‌గా ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’?

 తెలుగు లెక్చరర్‌గా ప్రిన్స్  మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం  ‘ఆచార్య’ ?   మహేష్‌బాబు కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘ దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా మరోసారి ఆయన కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహిళా కాలేజ్‌లో తెలుగు లెక్చరర్‌గా మహేష్ కనిపించబోతున్నాడని ప్రచారంలో ఉంది . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ‘చంద్రుడు ’, ఆగడు’ అనే టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ని చిత్ర బృందం పరిశీలిస్తోందని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి గా దేవీశ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నాడు. 

చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝం ఝూ మారుతమని ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి.

"బలమే జీవనము బలహీనతే మరణం" అన్న స్వామి వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాత. యువతకు స్పూర్తిగా చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద స్వామి విలక్షణ జీవనశైలి, విశ్ర్ష్టమైన ఆయన సేవలు సింహావలోకనం చేసుకోవటం ఎంతైన అవసరము. 1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాధ దత్తా, భువనేశ్వరి దంపతులకు వివేకానందుడు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుండి ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి, అద్భుత ధారణ శక్తి ప్రస్పుటమయ్యాయి. కళాశాలలో చదువుతుండగా తండ్రి విశ్వనాధ దత్త మరణించటంతో కుటుంబ భారం ఆయనపై పడినది. మరో వైపు వైరగ్య భావాలు అంకురించాయి. చిన్నప్పటి నుంచి నరేంద్రుడి కలల్లో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో గోచరించేది. ఈ తరుణం లో దక్షిణేశ్వరంలో వున్న రామకృష్ణ పరమహంసతో పరిచయము ఏర్పడింది. తొలి సారి రామకృ ష్ణ పరమహంసను కలువగానే "ఏంత కాలమునకు వచ్చితివోయి? ఇంతకాలము నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా?" ప్రపంచ ప్రజల తుచ్చ ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా! నీవు నరుడను సనాతన ఋషివి. ఇప్పుడు మానవ కోటి బాధలను రూపుమాపుటకై అవతరించిన నారాయణుడవు.