Skip to main content

‘అవును’ చిత్రం ఓ క్రైం సన్పెన్స్ థ్రిల్లర్.

క్లుప్తంగా ‘అవును’ చిత్రం ఓ క్రైం సన్పెన్స్ థ్రిల్లర్. మోహిని(పూర్ణ) ఆమె భర్త హర్ష(హర్షవర్ధన్ రాణే) ల చుట్టూ కథ తిరుగుతుంది. కొత్తగా పెళ్ళయిన వీరి జంట గండిపేట్ దగ్గరలో క్లాసిక్ హోమ్స్ అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్లిన అనతికాలంలోనే ఆ ఇంట్లో కొన్ని విచిత్రమయిన సంఘటనలు జరుగుతాయి. ఒకఆత్మ మోహినిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదిలా జరుగుతుండగా పక్కన ఇంట్లో పిల్లాడు విక్కి తన చనిపోయిన తాతతో మాట్లాడుతుంటాడు. విక్కికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి కాని ఎవరు అతనిని నమ్మరు. మోహిని వాళ్ళ ఇంట్లో కెప్టన్ రావు ఆత్మ ఉందని ఆ అబ్బాయి చెప్తాడు. హర్ష మరియు మోహిని హనీమూన్ కోసం ప్యారిస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కాని దయ్యం మోహినిని మరింత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోతుంది ఆ దయ్యం నుండి పారిపోవాలని ప్రయతించిన మోహిని ప్రయత్నాలు విఫలం అవుతాయి. మెల్లగా విక్కి తల్లి తండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు కెప్టన్ రావు ఆత్మ నిజంగానే ఉందని తెలుసుకొని మోహినిని కాపాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ ప్రయత్నం సఫలం అయ్యిందా? ఈ కెప్టన్ రావు ఎవరు? అనేది కీలకం.
+ points,-points

        పూర్ణ నటనలో మెప్పించింది. ఈ పాత్రకి ఆర్ జే కాజల్ అందించిన గాత్రం న్యాయం చేసింది. హర్షవర్ధన్ పరిది చిన్నదైనా బాగా చేశాడు. కీలక సన్నివేశాలలో అయన నటన ఆకట్టుకుంది. ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి యాక్టింగ్ ఓకే. రవి బాబు చేసింది చిన్న పాత్రనే అయినా కీలకమైంది. ఆయన పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. విక్కి పాత్రలో నటించిన పిల్లాడు చాలా బాగా చేశాడు. సుధా,రాజేశ్వరి ఇంకా, చలపతి రావు వారి పాత్రల పరిధి మేరకు చేశారు. కథనంలో వేగం, చివరి వరకు సస్పెన్స్ కొనసాగడం రక్తి కట్టించింది. సౌండ్ ఎఫెక్ట్స్, నేపధ్య సంగీతం అద్భుతం కాకపోయినా ఫర్వాలేదు. అయితే, దయ్యం పాత్రలో కీలక మార్పులను సరిగ్గా చూపించలేకపోయారు. ఇది హారర్ చిత్రం కాబట్టి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవటం విశేషమే.

సినిమాటోగ్రఫీ, లైటింగ్ స్కీమ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కొన్ని లోటుపాట్లు మినహా బావుంది. డైలాగ్స్ పరవాలేదు.శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం, రీ రికార్డింగ్ పనులు చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి