Skip to main content
'ఎవడు' చిత్రం కోసం '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగు
దేవిశ్రీ ప్రసాద్ 'ఎవడు' చిత్రం కోసం ఓ ఐటంసాంగ్ ను కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ హీరోగా వంశీ
పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం
దేవిశ్రీ '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగును సిద్ధం చేశాడు.
'గబ్బర్ సింగ్' చిత్రంలో 'కెవ్వు కేక' అనే పాటలో ఆ మాట ప్రతి పాదం చివరన
మాంచి ఊపుతో వస్తుంది. అలాగే ఈ పాటలో ప్రతి పాదం చివరన 'అయ్యోపాపం' అని
వస్తుందట. ఈ ఐటంసాంగును ఏ మెరుపు తీగ పై చిత్రీకరిస్తారో తెలియదుగానీ, పాట
మాత్రం చరణ్ కి ఎంతగానో నచ్చిందని అంటున్నారు. అద్భుతంగా వచ్చిన ఈ
ఐటంసాంగుని అనూహ్యమైన స్థాయిలో తెర కెక్కించ డానికి వంశీ పైడిపల్లి
సన్నాహాలు చేస్తున్నాడట. భారీ బడ్జెట్టుతో నిర్మితమౌతోన్న ఈ సినిమాలో సమంతా
- అమీ జాక్సన్ కథానాయికలుగా అలరించనున్నారు.
Comments
Post a Comment