Skip to main content

Posts

Showing posts from August, 2012

ఈ ప్రపంచం కళ్ళుతెరువక ముందే సంస్కృతీ ,సాంప్రదాయాలు,నాగరికతా ,నేర్చిన దేశం భారతదేశం .

ఈ ప్రపంచం కళ్ళుతెరువక ముందే సంస్కృతీ ,సాంప్రదాయాలు ,నాగరికతా ,నేర్చిన దేశం భారతదేశం .  సరస్వతీ నదీ పరీవాహక ప్రదేశంలోను, రావిసింధు నదీ ప్రాంతాలలోను 1922 నుంచి ప్రారంభించి ఇంత వరకు దాదాపు 2,500 త్రవ్వకాలు జరిగాయి. 80 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియని విశేషాలెన్నో ఇప్పుడు మన కు తెలుస్తున్నాయి. ఈ త్రవ్వకాలలో ప్రధానంగా సరస్వతీ నది ప్రవాహమార్గానికి ఇరు ప్రక్కల  బైటపడినవే అత్యధికం. సరస్వతీనది అదృశ్యమవడం ఒక విచిత్ర పరి స్థితిలో జరిగింది. పరిణామంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా నాగరికులు ఇరాన్‌, మెసపటోమియా వంటి అనేక సరిహద్దు భూభాగాలకు తమ జీవన భృతిని వెతు క్కుంటూ వెళ్లారు. క్రీ.పూ. 1900 ప్రాంతంలో అనేక వరదలు, కరువులు సంభవించడంతో వైదిక జనం ఇలా పశ్చి మానికి వలసలు పోయారని, వారిలో కొందరు వివిధ దిక్కులకు విస్తరించారని అంటే ఐరోపా భూభాగాల్లో కూడా విస్తరించారని స్పష్టమవుతోంది. ఆ విధంగా తద నంతర కాలపు వేయ్యి సంవత్సరాల వరకు అనేక రాజ వంశాలు, రాజులు ఆయా ప్రాంతాలలో తరచు కనిపిస్తూ, వినిపిస్తూ ఉండేవారని ఆ విధంగా పశ్చిమాన్నుంచి ఆర్యుల దండయాత్ర చేయుట అసత్యమని, కరువు కాటకాల వలన జీవనోపాధి కోసం సింధు స

అల్లు అర్జున్ స్టైలిష్ గా కట్టుకున్న కోత్త ఇల్లు చిత్రాలు

అల్లు అర్జున్  స్టైలిష్ గా కట్టుకున్న కోత్త ఇల్లు చిత్రాలు

జూనియర్ NTR బా ద్ షా ఫస్ట్ లుక్

జూనియర్ NTR బా ద్ షా ఫస్ట్ లుక్ జూనియర్ NTR బా ద్ షా ఫస్ట్ లుక్ 

'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' రైట్స్‌ కోసం పోటీపడుతున్న సల్మాన్‌ఖాన్‌

పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇప్పటికే క్రేజ్‌ కావాల్సినంత వచ్చేసింది. దీన్ని బాలీవుడ్‌ కూడా గమనించింది. అందుకే రాంబాబు రైట్స్‌ కోసం సల్మాన్‌ఖాన్‌ పోటీపడుతున్నట్లు తెలిసింది. దబాంగ్‌ సినిమాను పవన్‌ చేశాడు. అందులో ఖైదీలతో పారడీ చేసి హిట్‌ కొట్టేశాడు. ఆ ప్యారడీ దబాంగ్‌-2లో వాడేస్తున్నారు. ఇదిలా ఉంటే... అమితాబ్‌తో సినిమా తీసిన పూరీ స్టామినాను తెలుసుకుని పూరీతో సల్మాన్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. కానీ మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. అజయ్‌దేవగన్‌, అక్షయ్‌కుమార్‌లు కూడా రాంబాబు సినిమాపై మోజుపడినట్లు తెలిసింది. మరి ఈ ముగ్గురిలో ఫైనల్‌గా రాంబాబు చిత్రం ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఆంధ్ర భోజుడు మరియు కన్నడ రాజ్య రమా రమణుడు శ్రీ కృష్ణదేవ రాయలు

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర  భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకా నికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప

శఠగోపనంతో ఫలితమేమిటి?

శఠగోపనంతో ఫలితమేమిటి? దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు. శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం . జుట్టు కు సంబంధించి ఎన్నో సమస్యలు. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం.. ఇలా ఏన్నో సమస్యలు ఆడా మగా అనే తేడా లేకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎదుర్కొని శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడే మంచి తైలం ఉందని ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ తైలాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగ చేయ్యాలోచూద్దామా ........ . తైలం తయారీకి కావల్సినవి: పావుకిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందారపూలు, ఒక చెంచా అతిమధురం, కొబ్బరినూనె, తగినన్ని నీళ్లు తయారుచేసే విధానం: ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగుకల ఓ వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటతో కలబెడుతూ బాగా మరగేవరకూ వేడిచేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు నాలుగోవంతు వచ్చిన తర్వాత కొబ్బరినూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి.  కొంతసేపటికి నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దళసరి వస్త్రం ద్వారా మరోపాత్రలోకి వడకట్టాలి. అంతే..