Skip to main content

రాం సాగి అందించే అద్బుతం.............!!!!యానిమేషన్

  

ఈ క్రింది లింక్లను నొక్కండి కొన్ని అద్బుతమైన యానిమేషనులను చుడండి.

'రాం సాగి' అందించే అద్బుతం.......................!!!!

ఆధునిక తరం విద్యార్ధులను ఆకర్షిస్తున్న కెరియర్లలో యానిమేషన్ ఒకటి. ఈ రంగంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి ఆకాశమే హద్దు, దీనిలోకి ప్రవేశించాలంటే డిగ్రీ పూర్తిచేసే దాకా ఆగనక్కర్లేదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్ధలకు విభిన్నమైన యానిమేషన్ కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి.

ఒకప్పుడు వినోద రంగానికి మాత్రమే పరిమితంగా ఉండే యానిమేషన్ ప్రక్రియ నేడు అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తోంది. ఆటోమొబైల్, ఏరోస్పేస్, సివిల్, ఆర్కిటెక్చర్, విద్య, వైద్యం మందుల తయారీ, వాణిజ్య ప్రకటనలు మొదలైన ఎన్నో రంగాల్లో యానిమేషన్ ఉపయోగపడుతోంది. సృజన, సాంకేతిక పరిగ్జ్నానాల సమ్మేళనంగా యానిమేషన్ రంగం విస్తరిస్తోంది. వెబ్ యానిమేషన్, ఫీచర్ సినిమాలు, విడియో గేమ్స్, స్పెషల్ ఎఫెక్టులకు రూపకల్పన చేసేది యానిమేటర్లే. దేశీయంగా రూపొందిన ‘హనుమాన్’ లాంటి సినిమాల విజయం యానిమేషన్ కార్యకలాపాలకు ఊపునిచ్చింది.
‘నాస్కామ్’ అంచనా ప్రకారం వచ్చే ఏడాదికల్లా భారతీయ యానిమేషన్ మార్కెట్ విలువ రూ. 5,000 కోట్లకు చేరుతుంది. కానీ ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణుల కొరత ఉంది. మనదేశంలో ప్రస్తుతం యానిమేషన్ పిపుణులు దాదాపు 6,000 మంది మాత్రమే. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దాదాపు 40,000 మంది యానిమేటర్ల అవసరం ఏర్పడుతుందని ఈ రంగంలో అనుభవగ్జ్నులు చెపుతున్నారు.
ఈ రంగంలో ప్రవేశించదల్చినవారికి డ్రాయింగ్, స్కెచింగ్ నైపుణ్యాలు అవసరం. కంప్యూటర్ ఉపయోగించటం తెలిసివుండాలి. ఆంగ్ల పరిగ్జ్నానం ఉంటే మంచిది. సృజనాత్మకత, ఊహాశక్తి, పరిశీలన ఉన్నవారు మంచి యానిమేటర్లుగా రాణించగలుగుతారు.
యానిమేషన్ డిప్లొమాలో చేరటానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలై ఉండాలి. ఇదే అర్హతతో యానిమేషన్ డిగ్రీ కోర్సులో కూడా ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేట్లు యానిమేషన్ పీజీలో చేరవచ్చు. ‘స్వల్పకాలిక కోర్సులు చేస్లే ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. కానీ ఈ రంగంలో కెరియర్ తీర్చదిద్దుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్సులు చేయటమే మంచి’దని నిపుణులు సూచిస్తున్నారు.
దేశంలో యానిమేషన్ కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. మంచి శిక్షణసంస్థను ఏ రకంగా ఎంచుకోవాలనేది విద్యార్థులకు తరచూ వచ్చే సందేహం. తాము చేరదల్చిన సంస్థల కార్యాలయాలకు వెళ్ళి అక్కడ విద్యార్ధులకు శిక్షణ ఏ రకంగా లభస్తోంది తెలుసుకోవాలి. సంస్థ గత చరిత్ర, మౌలిక సదుపాయాలు పరిశీలించాలి. ప్లేస్మెంట్లు స్థితిని తెలుసుకోవాలి. పూర్వ విద్యార్ధుల అభిప్రాయాలు సేకరించాలి. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
ఈ క్రింది లింక్లను నొక్కండి కొన్ని అద్బుతమైన యానిమేషనులను చూడండి.














  

Comments

  1. comments please...............................ram sagi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి