Skip to main content

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం.

జుట్టు కు సంబంధించి ఎన్నో సమస్యలు. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం.. ఇలా ఏన్నో సమస్యలు ఆడా మగా అనే తేడా లేకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎదుర్కొని శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడే మంచి తైలం ఉందని ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ తైలాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగ చేయ్యాలోచూద్దామా ........ .


తైలం తయారీకి కావల్సినవి: పావుకిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందారపూలు, ఒక చెంచా అతిమధురం, కొబ్బరినూనె, తగినన్ని నీళ్లు
తయారుచేసే విధానం: ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగుకల ఓ వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటతో కలబెడుతూ బాగా మరగేవరకూ వేడిచేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు నాలుగోవంతు వచ్చిన తర్వాత కొబ్బరినూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి. 
కొంతసేపటికి నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దళసరి వస్త్రం ద్వారా మరోపాత్రలోకి వడకట్టాలి. అంతే.. మీకు కావలసిన తైలం సిద్ధమైనట్లే. ఈ తైలం సుమారు ఏడాది వరకూ నిల్వ ఉంటుంది.
ఈ తైలంతో మర్దన చేస్తే... తలనొప్పి, పార్వ్శపు నొప్పి, ఒత్తిడితో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 జుట్టుకు రోజు పట్టించి చూడండి అద్బుతమైన ఫలితాలు  పొందండి .

Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి