Skip to main content

'జులాయి' టాక్ ఏంటి?

              
                                                                                                 'జులాయి' టాక్ ఏంటి?                julayi-movie-stills-02   అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొంది ఈ రోజు విడుదల అయిన రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర తనదైన శైలిలో కొత్తగా ప్రయత్నించి మార్కులు కొట్టేసాడు. స్టైలిష్ స్టార్ అన్నపదానికి న్యాయం చేసే విధంగా డాన్స్ లు,ఫైట్స్ ఇరగతీసాడు.ఇలియానా ..మధు పాత్రలో జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి ప్రయత్నించింది. ఇంటర్వెల్ సీన్ దగ్గరలో ఆమె చేసిన నటన చాలా బాగుంది. ఆమె హైటెక్ ఇంజినీర్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది. సమాజం పట్ల భాద్యత కల పాత్రలో ఆమె మరిపిస్తుంది.  

                                                              ఖలేజాతో నిరాసపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫుల్ మీల్స్ తినిపించాడు. టెక్నికల్ గా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్,పంచ్ డైలాగులు పేలాయి. త్రివిక్రమ్ సినిమా అనగానే అంతా ముందుగా చూసేది డైలాగుల కోసమే. అతని పంచ్ ల కోసమే.      
కొన్ని పంచ్ లు 
  1. పొద్దునే లేవచ్చు కదరా అని తండ్రి అంటే.. ‘‘కోడి కూడా పొద్దున్నే లేస్తుంది. ఏం సాధించింది?         కూరొండుకుని తినేస్తున్నాం’’ అన్నది సమాధానం.
2.  ‘‘అంతేసార్. లాజిక్కులు తీస్తే నమ్మరు. మ్యాజిక్ చేస్తేనే నమ్ముతారు. అందుకే మన దగ్గర సైంటిస్టుల కంటే బాబాలు ఫ్యామస్’ అంటాడు.
3.‘‘అమ్మాయిని దేవతలా చూసుకుంటాం బాబూ’’ అంటే.. ‘‘నైవేద్యం చూపించి, ప్రసాదాలు మీరు మింగేద్దామనా’’
4. ‘‘నీకే ఇంత తలనొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజనంకి అమ్మామొగుడయ్యుంటాడు’’
5. ‘‘అలా చేయకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రమే నాకిస్తానన్నాడు మేడం’’
‘‘దాన్ని చూడండి. కరవొచ్చిన కంట్రీకి అంబాసిడర్ లా ఎలా తయారైందో’’
ఇవి మచ్చుకు కొన్నే. ఇలాంటి డైలాగులు ‘జులాయి’ నిండా బోలెడున్నాయి. అంతకు అద్భుతమైన టైమింగ్ తో, నటనతో నవ్వించే క్యారెక్టర్లున్నాయి. త్రివిక్రమ్ పెన్ పవర్, అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ ఏమైనా తగ్గాయేమో అని అనుమానాలుంటే జులాయి చూడండి! 
                                                     రవీందర్ నారాయణ్ (అల్లు అర్జున్) వైజాగ్ కు చెందిన కుర్రాడు. తండ్రి మాటల్ని లెక్క చేయడు. ఈజీ మనీపైనే అతని గురి. పదివేలిస్తే రెండు గంటల్లో లక్ష చేసి చూపిస్తానంటాడు. బయటికొచ్చి వర్షంలో నిలుచునుండగా ఓ కారొస్తుంది. లిఫ్టడుగుతాడు. అతనెక్కింది బ్యాంకులో దొంగతనానికి వెళ్తున్న ముఠా బండిని. ఆ ముఠాకు నాయకుడు బిట్టూ (సోనూసూద్) ఆ విషయం అర్థమై తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. తర్వాత పోలీసులు బిట్టూను పట్టేసుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది విలన్ కి, హీరోకి మధ్య ఫైట్. బిట్టూ తప్పించుకుంటాడు. హీరోను టార్గెట్ చేస్తాడు? అతను ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ డబ్బేమైంది? విలన్ కథ ఎలా ముగిసిందన్నది మిగిలిన కథ.
                                       దేవిశ్రీ సంగీతం సినిమా జోష్ ను పెంచడానికి ఉపయోగపడింది. సినిమా చివరి 30 నిమిషాల్లో రాజేంద్రప్రసాద్ అదరగొట్టారు. ఐతే ఆయనకు మేకప్ బాగా ఎక్కువవడం వల్ల సహజత్వం దెబ్బతింది.
ఫస్టాఫ్ తో పోలిస్తే  సెకండాఫ్ కొంచెం వీక్. సెకండాఫ్ మొదట్లో కథనం కొంచెం పక్కదారి పడుతుంది. సన్నివేశాలు కొంచెం స్లోగా నడుస్తాయి. మంచి పాటలన్నీ ఫస్టాఫ్ లోనే వస్తాయి. కానీ త్రివిక్రమ్ సరిపడా వినోదాన్నిచ్చాడు కాబట్టి జులాయికి బాక్సాఫీసులో ఢోకా లేదు.
          
                                            నా రేటింగ్ 3.75/5


Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి