Skip to main content

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం

 

  • మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు

  • కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున్నాయి.గోనెకాపుల్లో వితంతువివాహాలు నిషిద్ధం.కమ్మకాపుల్లో ఇల్లో చెల్లమ్మకమ్మ,గంపకమ్మ రెండుతెగలు.ఇల్లో చెల్లమ్మకమ్మస్త్రీలు పరదా పాటిస్తారు.గంపకమ్మస్త్రీలు పరదా పాటించరు.లింగాయతు కాపులకు జంగాలు గురువులు.వారు బ్రాహ్మణులను పిలవరు.వడకంటి కాపులు వధువుకు నల్లపూసలతాడు బదులు పసుపు తాడు కట్టిస్తారు.లింగాయతు కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెలిని చేసుకోవచ్చుకాని ఆమె అక్కను చేసుకోకూడదు.రెడ్డి కాపుల్లో విడాకులకు అనుమతిస్తారు.కులపంచాయితీ ముందు గడ్డిపరకను తుంచాలి.నామధారులు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే,విభూతిధారులు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.వైష్ణవరెడ్లు సాతాని అయ్యరు ద్వారా శవాలను దహనం చేస్తే,శైవరెడ్లు జంగందేవరలతో శవాన్ని పూడ్పిస్తారు.కమ్మ,వెలమ,రెడ్డి,కాపులు అందరిలో ఒకేవిధంగా ఉన్నఆచారాలు: నిశ్చితార్ధం,వరనిశ్చయం,పోచమ్మకొలువు,ప్రధానం,అయిరేనికుండలు,లగ్నం,పదఘట్టనం,జీరగూడం,కన్యాదానం,పుస్తె మట్టెలు,తలంబ్రాలు,బ్రహ్మముడి,అరుంధతీ దర్శనం,నాగవేలి,పానుపు,వప్పగింత. 

  • కాపు , బలిజ , తెలగ , ఒంటరి, నాయుడు కులాలు కాపు అనే ఒకే కులం కుదురుకు చెందినవారు. రెడ్డి, నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు.  

    చంద్ర వంశ బలిజ క్షత్రియులు


    బలిజ వంశోత్పత్తి వివిరణము.
    భాగవతము, నవమస్కంధము ౨౩ వ అధ్యాయము
    శ్రీ శుక వువాచ.

    "అనో: సభానరస్చక్షు: పరోక్షశ్చత్రయ స్సుతా:,

    సభానరాత్ కాలనరః సృన్జయంత త్సుతస్తత:.

    జనమేజయ స్తస్యపుత్రో మహాశీలో మహామనాః,

    ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ.

    శిబిర్వన స్సమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః,

    వృషాదర్భః సువీరశ్చ మద్ర: కైకయ ఆత్మజాః.

    శిబే శ్చత్వార ఏవా సం స్తితిక్షోశ్చ రుసద్ర థః,
    తతో హేమో థసుతపా బలి: సుతపసో భవత్.
    అంగ వంగ కళింగాద్యాః సింహపున్ద్రాంధ్ర సంజ్నితా:,
    జజ్ఞి రే దీర్ఘ తమసో బలే: క్షేత్రే మహీక్షిత:.
    చక్రు: స్వనామ్నా విషయాన్ శడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే."


    తాత్పర్యం: యయాతి మహారాజునకు కొడుకైన అనువునకు సభానరుడు, చక్షుస్సు, పరోక్షుడు అను మువ్వురు పుట్టిరి. సభానరునికి కాలనరుడును, కాలనరునకు సృంజయుండును, సృన్జయునకు పురంజయుడును, పురంజయునకు జనమేజయుడును, జనమేజయునకు మహాశీలుమ్డును, మహాసీలునకు మహా మనస్సును పుట్టిరి. మహా మనస్సునకు ఉసీనరుడు, తితిక్షువు అని యిర్వురు కొడుకులు పుట్టిరి. ఉసీరునకు శిబి, వన, శమి, దక్షుడు అని నల్వురు పుట్టిరి. శిబికి వృషాదర్భ, సువీర, మద్ర, కేకయ అని నల్వురు కలరు. తితిక్షువునకు రుశద్రదుడును, వానికి హేముడును, వానికి సుతపుడును, వానికి బలి యును పుట్టిరి. బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘతముడను ఋషి వలన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర, అను వారార్గురు జన్మించి, ఈ భూమిని భాగించుకుని వారి వారి దేశములకు వారి వారి పేరుల నుంచిరి.

    అది మొదలు అంగాది దేశములు ఆరు అయ్యెను.


    సుతపుడను మహారాజునకు బహుకాలము సంతానము లేనందున అనేకములైన బలులను, యాగాములను చేయగా నొక్క కుమారుడు బలి కల్గెను. ఆ బలివలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్రులు అనువారు బలిజవారైరి. అనగా, బలి: = బలియను వానికి, జ: = పుట్టినవారు అని వ్యుత్పత్తి.


    బలి కొమరుడైన ఆంధ్రుడు మగధ దేశమునకు రాజైనాడు. వీని వంశీయులు మహా పరాక్రమ శాలురై ౪౬౦ సంవత్సరములు హిమాచలము ఉజ్జయిని వంగ దేశము ఆనెగొంది..... ఈ సరిహద్దులలో గల దేశమును పాలించియుండిరి.

    బలిజ అనగా బలి అంటే యజ్ఞం అని, జ అనగా జన్మించిన వారని అర్థం.


    "బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
    ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
    కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
    కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
    అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
    కయ్యమందున కాలు కదిలించ బోరు
    నేయ్యమందు మహా నేర్పు గల వారు
    దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"


    "తెలివినేబదియారు దేశాదిపతులుగా

    నిలుచుట బలిజ సింహాసనంబు,

    శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె

    ......... బలిజ సింహాసనంబు,

    మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
    న్యాయంబు బలిజ సింహాసనంబు,
    త్యాగభోగంబుల దానకర్ణుని మించె
    నభివృద్ధి బలిజ సింహాసనంబు,
    మాళ వాంధ్ర మగధ కురూ లాట
    ........... ప్రభులు బలులు
    అద్భుతంబైన బలిజ సింహాసనంబు."



    కాపు:-


    "సమర సమయములందు పితురుల
    క్షాత్ర తెజములన్ నిలువబెట్టువాండు కాపు
    శాంతి దినములన్ సేద్యమున్ దే
    శమున్ గాపాడువాండు కాపు”

    "కాపు వల్లనే కదా ! కరణీక ప్రజ్ఞలు ఆదాయ వ్యయములు వ్రాయగలిగె,

    కాపు వల్లనే కదా ! ఘనమైన రాజులు చేకొని రాజ్యంబు చేయగలిగె,
    కాపు వల్లనే కదా ! గ్రామ ఘాన సేయు నెరవుగా ధాత్రిని నిలువ గలిగె,
    కాపు వల్లనే కదా ! కవిభట కోట్లెల్ల బహు భోగముల చేత బ్రతుక గలిగె,
    కాపు హెచ్చైన మీసరగండ బిరుదు విజయ విఖ్యాతి గొనె చాల వేద్కలలరి
    కాపు దేవుడు దేవుడు కలియుగమున !!"
    *గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
    గబ్బి మిటారి చూపులది కాపు ది దానికి నేల యొక్కనిన్
    బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని దా
    నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్ -శ్రీనాధుని చాటువు (25)

    ఈ కులంలో జన్మించిన ప్రముఖులు
  • తుళువ, అరవీటి వంశీయులు
  • మధుర, తంజావూరు, ఛెంజి, ఖండీ నాయక రాజులు
  • బారామహల్ పాలకులు శ్రీ జగదేవరాయలవారి సంతతి
  • హండే అనంతపురం పాలకులు
  • పెనుకొండ పాలకులు
  • కొలను పాలకులు
  • అళియ రామ రాయలు
  • గాజుల లక్ష్మీనరసు శెట్టి - సంఘ సంస్కర్త
  • ఇ.వి. రామస్వామి నాయకర్ సంఘ సంస్కర్త మరియు ద్రావిడ ఉద్యమ పిత
  • సర్ రాయబహద్దుర్ డాక్టర్ శ్రీ కూర్మా వేంకట రెడ్డి నాయుడు
  • రావు సాహేబు శ్రీ పోలిశెట్టి రంగనాయకులు నాయుడు గారు, ఫేమస్ ఇంజనీర్.
  • కన్నెగంటి హనుమంతు-భారత స్వాతంత్ర్య సమర యోధుడు
  • బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు-సంఘ సంస్కర్త మరియు బ్రహ్మసమాజ నాయకుడు
  • రఘుపతి వెంకయ్య నాయుడు - దక్షిణ బారత సినిమా మూలపురుషుడు.
  • సామినేని ముద్దు నరసింహ నాయుడు - డిస్ట్రిక్ట్ మున్సబ్ గారు, పెద్దాపురం
  • కలియుగ భీముడు కోడి రామమూర్తి
  • క్రికెటర్ కటారి కనకయ్య నాయుడు
  • సామర్ల వేంకట రంగారావు
  • పసుపులేటి కన్నాంబ
  • మహానటి సావిత్రి
  • రాజనాల కాళేశ్వర రావు నాయుడు
  • కైకాల సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • గురుకుల మిత్రా
  • అంబటి లక్ష్మణరావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • ముత్తా గోపాలకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • మంగారి రాజేందర్ తెలుగులో తీర్పు నిచ్చిన న్యాయమూర్తి.
  • వెంకటేశ్వర రాయుడు తెలుగును బాగా అమలుచేసిన కలెక్టర్.
  • దాసరి నారాయణరావు
  • తాపీ ధర్మారావు
  • డా.ఎస్.రామచంద్రరావు బి.సి.రాయ్ అవార్డు గ్రహీత
  • పి.శివశంకర్ కేంద్ర మంత్రి
  • రామినేని రామానుజం లోకాయుక్త
  • మణికొండ చలపతిరావు జర్నలిస్టు
  • వంగవీటి రంగా
  • ముద్రగడ పద్మనాభం
  • మండలి బుద్ధప్రసాద్
  • డి.శ్రీనివాస్
  • పొన్నాల లక్ష్మయ్య
  • బొత్స సత్యనారాయణ
  • కన్నా లక్ష్మీనారాయణ
  • ఆళ్ళ రఘు బాబు
  • చేగొండి హరిరామజోగయ్య
  • కొత్తపల్లి సుబ్బారాయుడు
  • మెంటే పద్మనాభం
  • అల్లం అప్పారావు
  • గోవిందరాజులు నాయుడు
  • పెంటపాటి పుల్లారావు
  • ద్వారం వెంకటస్వామి నాయుడు
  • పిఠాపురం నాగేశ్వరరావు
  • శోభానాయుడు
  • ఆచంట వెంకటరత్నం నాయుడు
  • డి.వి.సుబ్బారావు
  • యర్రంసెట్టి శాయి
  • చందు సోంబాబు
  • అడ్డాల చంటి
  • ఆదినారాయణరావు
  • ఏడిద నాగేశ్వరరావు
  • గరికపాటి రాజారావు
  • అంజలి
  • సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  • భానుచందర్
  • దేవిక
  • జి.వరలక్ష్మి
  • దవళ సత్యం
  • పి.పుల్లయ్య
  • దేవిశ్రీప్రసాద్
  • చక్రి
  • రమణ గోగుల
  • సాలూరి రాజేశ్వరరావు
  • రమేష్ నాయుడు
  • మాస్టర్ వేణు
  • అ0బటీ రామ్ బాబు
  • బూరగడ్డ వేదవ్యాస
  •    note:-  ఈ వ్యాసము వికీపీడియా నుండి గ్రహించబడినది .తప్పులు ఉంటే క్షమించండి .

 

Comments

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి